తెలంగాణ

telangana

By

Published : Mar 30, 2022, 12:32 PM IST

ETV Bharat / bharat

భార్యపై అనుమానం... పిల్లలు సహా నలుగురి హత్య!

Ahmedabad family murders: ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారిపోయిన ఘటన గుజరాత్​లో జరిగింది. వీరందరినీ కుటుంబ పెద్దే హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే వీరిని హత్య ఉంటాడని భావిస్తున్నారు.

Viratnagar in Ahmedabad
Viratnagar in Ahmedabad

Ahmedabad family murders: గుజరాత్​లోని అహ్మదాబాద్​లో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు శవాలుగా కనిపించారు. విరాట్​నగర్ ప్రాంతంలోని దివ్యప్రభ సొసైటీలో ఈ ఘటన జరిగింది. కుటుంబ పెద్ద వినోద్ మరాఠీ పరారీలో ఉన్నాడు. దీంతో హత్యకు అతడే కారణమై ఉండొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

హత్యలు జరిగిన ఇంటి వద్ద పోలీసులు
మృతదేహాలను తీసుకెళ్తున్న సిబ్బంది

వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతోనే తన భార్యను వినోద్ చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు పిల్లలు సహా, మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వీరందరిదీ ఒకే కుటుంబమని తెలిపారు. అయితే, వీరిని ఎప్పుడు చంపేశారనేది తెలియలేదు. మృతదేహాల నుంచి దుర్వాసన రావడం వల్ల.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన జరిగిన ఇల్లు
..

తొలుత ఆత్మహత్య అని అనుమానించినప్పటికీ.. వినోద్ పరారీ విషయం తెలుసుకొని హత్య అని నిర్ధరణకు వచ్చినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుపై ముమ్మరంగా విచారణ జరుపుతోంది. డాగ్ స్క్వాడ్​లను రంగంలోకి దించింది. ఫోరెన్సిక్ శాఖ సమన్వయంతో ఆధారాలు సేకరిస్తోంది.

ఇదీ చదవండి:దళితుడిపై దారుణం.. హింసించి.. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి..

ABOUT THE AUTHOR

...view details