తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు మద్దతుగా న్యాయవాది ఆత్మహత్య - Advocate commits suicide news

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. టిక్రీ సరిహద్దులో పంజాబ్​కు చెందిన ఓ న్యాయవాది విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. అన్నదాతల పరిస్థితి చూసి చలించిపోయే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Lawyer from Punjab dies by commits near farmers' protest site
రైతులకు మద్దతుగా న్యాయవాది ఆత్మబలిదానం

By

Published : Dec 28, 2020, 4:19 PM IST

దిల్లీ సరిహద్దులో నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్న అన్నదాతలకు మద్దతుగా పంజాబ్​ జలాలాబాద్​కు చెందిన న్యాయవాది అమర్​జీత్​ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. టిక్రీ సరిహద్దులో విషం తాగిన ఆయనను రోహ్తక్​లోని పీజీ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాను చనిపోతున్నట్లు ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు న్యాయవాది. రైతుల పరిస్థితి చూసి తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కర్షకుల గోడును కేంద్రం ఇప్పటికైనా వినాలని విజ్ఞప్తి చేశారు. కొత్త చట్టాలు మోసపూరితంగా ఉన్నాయని.. అన్నదాతలు, కార్మికుల్లో అభద్రతాభావం నెలకొందని లేఖలో ఆరోపించారు.

ఈ లేఖ డిసెంబర్​ 18న రాసినట్లు ఉందని పోలీసులు తెలిపారు. ఇది ఆయన రాశారో లేదో ధ్రువీకరించాల్సి ఉందన్నారు. న్యాయవాది బంధువులకు సమాచారాన్ని అందించినట్లు చెప్పారు.

రైతులకు మద్దతుగా ఇప్పటికే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సిక్కు మత బోధకుడు సంత్ రామ్​ సింగ్​ సింఘు సిరిహద్దులో ఈ నెల మొదట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. దిల్లీ సరిహద్దులో నిరసల్లో పాల్గొని ఇంటికెళ్లిన పంజాబ్​కు చెందిన 22ఏళ్ల రైతు కూడా అన్నదాల పరిస్థితిని చూసి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సింఘు సరిహద్దులో గతవారం 65ఏళ్ల రైతు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

ఇదీ చూడండి: కదన స్ఫూర్తితో కర్షక లోకం- 33వ రోజుకు ఆందోళన

ABOUT THE AUTHOR

...view details