తెలంగాణ

telangana

By

Published : Jan 4, 2023, 5:29 PM IST

Updated : Jan 4, 2023, 7:39 PM IST

ETV Bharat / bharat

కేంద్రం కీలక నిర్ణయం.. కశ్మీర్​కు మరో 2000 మంది సైనికులు

జమ్ము కశ్మీర్​లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కేంద్రం పటిష్ఠ చర్యలు తీసుకుంది. సరిహద్దు జిల్లాలైన పూంచ్​, రాజౌరీ జిల్లాలకు మరో 2000 సీఆర్​పీఎఫ్ సైనికులను పంపుతోంది.

additional crpf troops to kashmir
additional crpf troops to kashmir

జమ్ము కశ్మీర్​లో వరుసగా పౌర హత్యలు, ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్​కు అదనంగా 20 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిస్తున్నట్లు సీఆర్​పీఎఫ్​ ప్రకటించింది. 2000 మందితో కూడిన ఈ బలగాలను పూంచ్​, రాజౌరీ జిల్లాలో మోహరించనున్నట్లు పేర్కొంది. 8 సీఆర్​పీఎఫ్​ కంపెనీలను జమ్ము కశ్మీర్​ సమీపంలోని ప్రదేశాల నుంచి తరలించగా.. 10 కంపెనీలను దిల్లీ నుంచి పంపించనున్నట్లు తెలిపింది. జమ్ములో భారీ ఉగ్రదాడి జరగనుందనే నిఘా వర్గాల​ హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జమ్ము కశ్మీర్​ రాజౌరీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మరోవైపు డిసెంబర్​ 16న ఆర్మీ క్యాంప్​ సమీపంలో నలుగురు పౌరులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు లెఫ్టినెంట్​ గవర్నర్​ మనోజ్​ సిన్హా.

Last Updated : Jan 4, 2023, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details