తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడిరోడ్డుపై స్టార్​ నటుడితో కాంగ్రెస్​ కార్యకర్తల ఫైట్​

భగ్గుమంటున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేరళలో కాంగ్రెస్​ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. స్టార్​ నటుడు జోజు జార్జ్​- కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య వాగ్వివాదం నెలకొంది. ఆగ్రహంతో జోజు కారు అద్దాన్ని కాంగ్రెస్​ కార్యకర్తలు కొందరు పగలగొట్టారు.

By

Published : Nov 1, 2021, 4:25 PM IST

Updated : Nov 1, 2021, 7:47 PM IST

Actor Joju
నడిరోడ్డుపై స్టార్​ నటుడితో కాంగ్రెస్​ కార్యకర్తలు ఫైట్​

నడిరోడ్డుపై స్టార్​ నటుడితో కాంగ్రెస్​ కార్యకర్తల ఫైట్​

రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలకు వ్యతిరేకంగా కేరళలోని ఎర్నాకుళంలో సోమవారం కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఫలితంగా ఆ ప్రాంతంలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ నిలిచిపోయింది. నటుడు జోజు జార్జ్​.. ట్రాఫిక్​లో రెండు గంటల పాటు చిక్కుకున్నారు. దీంతో సహనం కోల్పోయిన ఆయన కారు దిగి కాంగ్రెస్​ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. సాధారణ పౌరులకు కష్టాలు తెచ్చిపెట్టే విధంగా నిరసనలు తెలపడం తగదని వారించారు. దీంతో ఆగ్రహానికి గురైన కాంగ్రెస్​ కార్యకర్తలు.. జోజు కారు అద్దాన్ని పగలగొట్టారు.

జోజు జార్జ్​

'ఇంధన ధరలు పెంపు అనేది చాలా పెద్ద విషయం. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశంపై నిరసన తెలపాలి. కానీ ఈ విధంగా కాదు. ప్రజలకు కష్టమవుతోంది. ఆసుపత్రికి వెళ్లాల్సిన వారు ట్రాఫిక్​ జామ్​లో ఇరుక్కుపోయారు,' అని జోజు భావోద్వేగంతో మీడియా ముందు మాట్లాడారు.

జోజు జార్జ్​ వాహనం

అయితే కాంగ్రెస్​ వాదన మరో విధంగా ఉంది. జోజు మద్యం సేవించి మహిళా కార్యకర్తలతో దురుసగా మాట్లాడారని ఆరోపించింది. కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకరన్​ సైతం జోజుపై మండిపడ్డారు. మద్యం సేవించి 'గూండా'లా ప్రవర్తించారన్నారు. జోజుపై చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

కాంగ్రెస్​ నిరసన

ఘటన జరిగిన కొద్దిసేపటికి త్రిపునితుర ప్రాంతంలోని ఓ ఆసుపత్రికి వెళ్లిన జోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన మద్యం సేవించలేదని తేలింది. తాను గొడవలు కోరుకోవడం లేదని, ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించాలని జోజు కోరారు. అయితే ఈ విధంగా నిరసనలు తెలపడం సరికాదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:-సామాన్యుడికి 'పెట్రో' సెగ - మళ్లీ పెరిగిన చమురు ధరలు

Last Updated : Nov 1, 2021, 7:47 PM IST

ABOUT THE AUTHOR

...view details