తెలంగాణ

telangana

By

Published : Feb 15, 2021, 6:41 PM IST

ETV Bharat / bharat

'కరోనాకు త్వరలో 19 టీకాలు!'

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని సంస్థలు కొవిడ్​ టీకాలను అందుబాటులోకి తెస్తున్నాయని పేర్కొన్నారు. 50 ఏళ్లు పైడిన వారికి కూడా త్వరలో టీకా పంపిణీ ప్రారంభిస్తామన్నారు.

vaccine, harsh vardhan
వ్యాక్సిన్లపై హర్షవర్ధన్ కీలక ప్రకటన

కొవిడ్​ టీకాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 18-19 సంస్థలు వ్యాక్సిన్లు​ రూపొందిస్తున్నాయని, ప్రయోగ​ దశలో ఉన్న ఈ టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 2-3 వారాల్లో 50 ఏళ్లు పైడిన వారికి టీకా పంపిణీ చేపడతామని చెప్పారు.

"ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం. అసలు టీకా​తో పాటు ఈ సోషల్​ వ్యాక్సిన్​ కూడా అందరికీ అవసరం.

గత ఏడు రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క ప్రాంతంలోనూ కొవిడ్​ కేసులు నమోదు కాలేదు. అదే విధంగా మూడు వారాల్లో 21 జిల్లాల్లో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. మరో 20-25 దేశాలకు భారత్​ టీకాలను అందిస్తుంది."

-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రస్తుతం భారత్​లో రెండు సంస్థలు మాత్రమే కొవిడ్​ టీకా అందిస్తున్నాయి. కొవాగ్జిన్​ పేరుతో భారత్​ బయోటెక్​, కొవిషీల్డ్​ పేరుతో ఆస్ట్రాజెనికా టీకాను సీరం సంస్థ పంపిణీ చేస్తున్నాయి.

ఇదీ చదవండి :ట్రక్కు బోల్తా.. 15 మంది కూలీలు మృతి

ABOUT THE AUTHOR

...view details