హరియాణ.. కురుక్షేత్రం, మహాభారతం, శక్తిపీఠం సహా ఇతర హిందూ పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి. అక్కడ షేక్ చిల్లీ సమాధి కూడా అంతే ప్రసిద్ధి చెందింది. సాధారణంగా షేక్ చిల్లీ అన్న పేరు వినగానే.. లేని పోని గొప్పలుపోయే హాస్యగాడు గుర్తుకు వస్తాడు. కానీ ఇక్కడ చెప్తున్న షేక్ చిల్లీ కథ వేరు. ఆయన అసలు పేరు షేక్ చహేలీ.
"థానేసర్లో ఉన్న షేక్ చిల్లీ సమాధిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పెద్ద కుమారుడు దారా శిఖో నిర్మించినట్లు చెప్తారు. షేక్ చిల్లీ అసలు పేరు షేక్ చహేలీ. ఇరాన్కు చెందిన సూఫీ సాధువు. భారత్ లోని సడోరా సహా వివిధ ప్రాంతాల్లో షేక్ చహేలీ నివసించినట్లు చెప్పుకుంటారు. మరణం తర్వాత దారా శిఖో ఆయనకు సమాధి నిర్మించాడట."
-రాజేందర్ రాణా, చరిత్రకారుడు
"కురుక్షేత్ర శివార్లలో షేక్ చిల్లీ సమాధి ఉంది. మొఘలుల శైలిలో నిర్మితమైన సుందర కట్టడమిది. ప్రధాన భవనం మార్బుల్ రాయితో కట్టారు. దానిపైనే గోపురం ఉంటుంది. ఉత్తర భారతంలో తాజ్ మహల్ తర్వాత షేక్ చిల్లీ సమాధికి రెండో స్థానం ఇచ్చారు. షేక్ చిల్లీ సమాధి పక్కనే ఆయన భార్య సమాధి కూడా ఉంటుంది. సాండ్స్టోన్తో కట్టిన ఈ సమాధిపై పూల డిజైన్ ఉంటుంది."