తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2021, 10:08 PM IST

ETV Bharat / bharat

ముంబయి​లో రూ.12.5 కోట్ల విలువైన డ్రగ్స్​ పట్టివేత

మహారాష్ట్ర ముంబయిలో మాదకద్రవ్యాలను స్మగ్లింగ్​ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నుంచి 12.5 కోట్ల రూపాయల విలువైన మెఫిడ్రోన్​(ఎండీ)ను స్వాధీనం చేసుకున్నారు.

A person has been arrested with 25 kgs of mephedrone
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు

మహారాష్ట్రలోని ముంబయిలో మరో డ్రగ్స్ రాకెట్​ బయటపడింది. డోంగ్రీ ప్రాంతంలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 25 కేజీల మెఫిడ్రోన్​(ఎండీ) అనే డ్రగ్​ను నిందితుని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ రూ.12.5 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రూ.5 లక్షల నగదును సైతం స్వాధీనం చేసుకున్నట్టు ముంబయి పోలీసులు వివరించారు.

స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను చూపిస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details