తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారిని తొలగించండి'- సుప్రీంకు రైతుల విజ్ఞప్తి - వారిని తొలగించండి.. సుప్రీంని కోరిన రైతు సంఘం

వ్యవసాయ చట్టాలపై రైతులు- కేంద్రం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీలో ముగ్గురిని తొలగించాలని కోరింది ఓ రైతు సంఘం. ఈ మేరకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారు సాగు చట్టాలకు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది.

A farmers' association has demanded the removal of three members of a four-member committee set up to resolve agricultural laws
వారిని తొలగించండి.. సుప్రీంని కోరిన రైతు సంఘం

By

Published : Jan 16, 2021, 5:20 PM IST

సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీలోని ముగ్గురు సభ్యులను తొలగించాలని కోరుతూ.. భారతీయ కిసాన్​ యూనియన్ లోక్​శక్తి​, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారందరూ వ్యవసాయ చట్టాలకు మద్దతుగా ఉన్నారని ఆరోపించింది. దీని వల్ల సహజ న్యాయ సూత్రానికి తావుండదని పేర్కొంది. ఇరువర్గాలకు అనుకూలంగా పని చేసే వ్యక్తులను నియమించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 40 రైతు సంఘాలలో భారతీయ కిసాన్​ యూనియన్​ ఒకటి. కాగా, ఈ చట్టాల అమలును నిలిపివేస్తూ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. భూపిందర్​ సింగ్​ మన్​, డా.ప్రమోద్​ కుమార్​ జోషి, అశోక్​ గులాటి, అనిల్​ ఘన్వంత్​లను సభ్యులుగా చేర్చింది. కమిటీలో నుంచి మన్​ ఇప్పటికే తప్పుకోగా.. మిగిలిన వారినీ తొలగించాలని భారతీయ కిసాన్​ యూనియన్​ తాజాగా కోరింది.

మరోవైపు.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించతలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేసింది కేంద్రం. ఈ పిటిషన్​ను కొట్టివేయాలని కోరుతూ రైతు సంఘాలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సదరు దరఖాస్తును జనవరి 18న విచారించడానికి ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.

ఇదీ చదవండి:ఆర్మీ అధికారి అరుదైన ఫీట్​.. గిన్నిస్​లో చోటు..

ABOUT THE AUTHOR

...view details