తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా సోకిన జంట.. ఆస్పత్రిలో మనువాడెనంట! - వైరల్​ వివాహం

ఆ వధూవరులిద్దరికి కరోనా పాజిటివ్​. ఇద్దరూ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితేనేం.. తాము పెళ్లి చేసుకోవడానికి వైరస్​ అడ్డంకి కాదని అనుకున్నారు. అందుకే.. కొవిడ్​ చికిత్సా కేంద్రంలోనే పెళ్లి చేసుకున్నారు.

marriage in covid care center
కొవిడ్​ చికిత్సా కేంద్రంలో పెళ్లి

By

Published : May 16, 2021, 12:56 PM IST

కొవిడ్​ చికిత్సా కేంద్రంలో.. కరోనా సోకిన ఓ జంట వివాహం చేసుకుంది. ఈ సంఘటన ఛత్తీస్​గఢ్​ బలోద్​లో శనివారం జరిగింది. ఆస్పత్రిలో ఇంటి వాతావరణం కనిపించేలా ప్రత్యేకంగా అలంకరించారు. సిబ్బంది, రోగులు అందరూ అభినందిస్తుండగా.. వారిద్దరూ ఏడడుగులు నడిచారు.

ఆస్పత్రిలో పెళ్లి చేసుకుంటున్న కొవిడ్​ సోకిన జంట

"ఓ జంట తాము ఇక్కడ మళ్లీ పెళ్లి చేసుకుంటామని అడిగింది. అందుకే.. ఆస్పత్రిలో ఇల్లు లాంటి భావన కలిగించేలా మేం ఈ వివాహాన్ని జరిపించాం. సిబ్బంది, రోగులు చుట్టూ ఉండగా కుటుంబ వేడుకలాగా ఈ కార్యక్రమం జరిగింది" అని ఈ చికిత్సా కేంద్రాన్ని నిర్వహించే జైన్​ కమ్యూనిటీ అధ్యక్షుడు చెప్పారు.

ఆస్పత్రిలో పెళ్లి ఏర్పాట్లు

సామాజిక మాధ్యమాల్లో ఈ పెళ్లి జంటను నెటిజన్లు అభినందనలతో ముంచెత్తారు.

ఇదీ చూడండి:ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు!

ABOUT THE AUTHOR

...view details