అంత్యక్రియల్లో పేల్చిన నిషేధిత నాటుబాంబు (country bomb explosion) కారణంగా ఓ బాలుడికి కంటిచూపు దూరమైంది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. నగర శివారులోని జఫర్ఖాన్ పేటలో నివాసం ఉంటున్న బాలుడు సంతోష్(14) తన సోదరిని కళాశాల నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. పక్క వీధిలో ఓ షాప్ వద్ద కొంతసేపు కూర్చున్నాడు. ఇంతలో ఓ కుటుంబం.. వృద్ధురాలి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని రోడ్డు మీద తీసుకెళ్లింది. అదే సమయంలో భారీగా టపాసులు పేల్చారు. ఈ క్రమంలో ఓ నాటుబాంబు పేలడం వల్ల పక్కనే ఉన్న రాయి ఎగిరి అక్కడ కూర్చున్న బాలుడి కంటికి బలంగా తగిలింది. నొప్పితో అతడు విలవిలలాడాడు. బాలుడ్ని అస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించి.. కంటిచూపు పోయిందని వైద్యులు తెలిపారు.
నాటుబాంబు పేలి- చూపు కోల్పోయిన బాలుడు - టపాసుల పేలుడులో కనుచూపు కోల్పోయిన బాలుడు
అంత్యక్రియల్లో పేల్చిన నిషేధిత నాటు బాంబుతో(country bomb explosion) ఓ బాలుడి కంటిచూపు పోయింది. ఈ ఘటన తమిళనాడు చెన్నైలో జరిగింది.
టపాసుల కాల్చివేత
బాలుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తన సోదరుడి కంటి ఆపరేషన్కు సహాయం చేయాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:బాలికపై లైంగిక వేధింపులు.. లేఖ రాసి ఆత్మహత్య