బంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన 9మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. బక్కాలీ తీరంలో ఉన్న రక్తేశ్వరీ దీవి వద్ద బుధవారం.. హైమావతి అనే పడవ ప్రమాదానికి గురైంది. చేపలు పట్టిన అనంతరం తిరిగి వస్తున్న సమయంలో భారీఎత్తున అలలు ఎగసిపడటం వల్ల పడవ మునిగిపోయింది.
పడవ ప్రమాదంలో 9 మంది మృతి - bengal boat capsize news
బంగాల్లో బుధవారం జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది మరణించారు. పడవ నడుపుతున్న ఇద్దరు సురక్షితంగా బయటపడగా.. గల్లంతైన మరొకరి కోసం అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు.
![పడవ ప్రమాదంలో 9 మంది మృతి BENGAL CAPSIZE](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12467183-thumbnail-3x2-dd.jpg)
పడవ ప్రమాదంలో 9 మంది మృతి
మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు
ఒక్కసారిగా అలలు విరుచుకుపడగానే.. పడవ నడుపుతున్న ఇద్దరు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో మిగతా వారు నిద్రిస్తున్నారని వెల్లడించారు. నిద్రలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. గల్లంతైన ఓ వ్యక్తికోసం గాలిస్తున్నారు.
Last Updated : Jul 15, 2021, 4:32 PM IST