తమిళనాడులో 80 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. చెంగల్పట్టు జిల్లాలోని నావలూరు చెక్పోస్ట్ వద్ద ఓ మినీ వ్యాన్ నుంచి విలువైన ఆభరణాలను మంగళవారం సీజ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వాహనాల తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేనందున భారీ మొత్తంలో పసిడిని స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడు: వ్యానులో 80 కేజీల బంగారం - tamilnadu
ఎన్నికల వేళ తమిళనాడులో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. వాహనాలు తనిఖీ చేస్తుండగా 80 కిలోల బంగారం పట్టుబడింది.
![తమిళనాడు: వ్యానులో 80 కేజీల బంగారం 80 kg gold seized by Election flying squad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11129872-thumbnail-3x2-yv.jpg)
తమిళనాడులో 80 కేజీల బంగారం సీజ్
అనంతరం సంబంధిత వ్యక్తులు రిటర్నింగ్ అధికారికి పత్రాలను సమర్పించిన తర్వాత వాటిని తిరిగి అప్పగించించి ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్. ప్రముఖ జీఆర్టీ గోల్డ్ జువెలరీ సంస్థ తమ బ్రాంచులకు ఓ ప్రైవేట్ వ్యానులో బంగారాన్ని తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఇదీ చూడండి:కమల్ వాహనంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు