తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలుడిని కాటేసిన పాములు.. సర్పాలను చంపి.. కుమారుడితో పాటే ఆస్పత్రికి తీసుకెళ్లిన తండ్రి - కాటు వేసిన పాముల్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఘటన

ఓ బాలుడిని రెండు పాములు కాటేశాయి. అయితే ఆ పాములను చంపిన బాలుడి తండ్రి వాటిని తన కుమారుడితో పాటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Oct 8, 2022, 7:07 PM IST

తమిళనాడు తిరువళ్లూర్​లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ బాలుడిని రెండు పాములు కాటు వేశాయి. అప్రమత్తమైన బాలుడి తండ్రి ఆ రెండు పాములను చంపి.. తన కుమారుడితో పాటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

పాములను పట్టుకుని ఆస్పత్రికి వెళ్తున్న మణి
బాలుడిని కాటువేసిన పాములు

తిరువళ్లూర్ సమీపంలోని కొల్లకుప్పం గ్రామంలో ఎల్లమ్మాళ్​, మణి దంపతులు నివసిస్తున్నారు. వీరికి మురుగన్​(7) అనే కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులు వృత్తిరీత్యా కూలీలు. శుక్రవారం రాత్రి మురుగన్ ఇంట్లో నిద్రిస్తుండగా రెండు పాములు కాటు వేశాయి. అది గమనించిన మురుగన్ తండ్రి మణి.. వెంటనే రెండు పాములను కొట్టి చంపేశాడు. అనంతరం తిరువళ్లూర్ మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి మురుగన్​తో సహా ఆ రెండు పాములను తీసుకెళ్లాడు. ప్రస్తుతం మురుగన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

విషసర్పాలు

ABOUT THE AUTHOR

...view details