ఈ రోజుల్లో.. ఇంట్లో కొంతసేపు కరెంట్ లేకపోయినా.. ఎంతో ఇబ్బందిగా భావిస్తుంటాము. అలాంటిది.. మహారాష్ట్ర నాశిక్ జిల్లా త్రయంబకేశ్వర్ మండలంలోని 60 గ్రామాల ప్రజలు.. పది రోజులుగా చీకట్లోనే ఉంటున్నారు. ముఖ్యంగా.. రాత్రిళ్లు విద్యుత్ లేకపోవడం వల్ల.. అటవీ జంతువులు దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఈ ప్రాంతంలోని 60 గ్రామాల్లో 8 నుంచి 10 రోజులుగా విద్యుత్ సరఫరా లేదు. దీంతో గ్రామస్థులంతా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాత్రిళ్లు చీకటిగా ఉండటం వల్ల అడవి జంతువులు మాపై దాడులు చేస్తున్నాయి. అధికారులు వెంటనే విద్యుత్ను పునరుద్ధరించాలని మేం వేడుకుంటున్నాం."
- సంజయ్ గంగోడే, బెల్గోడగా గ్రామ సర్పంచ్