ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు దుర్మరణం - కారు ప్రమాదం
08:05 February 13
ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు దుర్మరణం
ఉత్తర్ప్రదేశ్ కన్నౌజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లఖ్నవూ ఎక్స్ప్రెస్ వే పై నిలిచి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులోని ఆరుగురు దుర్మరణం చెందారు.
దట్టమైన పొగ మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవటం వల్లే ట్రక్కును ఢీకొట్టినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు తాలాగ్రామ్ ఠాణా పోలీసులు. ఘటనపై బాధితుల కుటుంబీకులకు సమాచారం అందించి.. మృతదేహాలను శవపరీక్షకు తరలించారు. వారు అంతా కారులో బాలాజీ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.