తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజస్థాన్​లో 53 నెమళ్లు మృతి- కారణమేంటి? - నెమళ్ల అనుమాస్పద మృతి

రాజస్థాన్​లోని నాగౌర్ జిల్లాలో 53 నెమళ్లు అనుమానస్పద రీతిలో మృతి చెందాయి. మరో 26 గాయపడ్డాయి. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

53 peacocks found dead
రాజస్థాన్​లో 53 నెమళ్లు మృతి

By

Published : Jan 2, 2021, 5:11 PM IST

రాజస్థాన్​లోని నాగౌర్ జిల్లా కల్వా గ్రామంలో భారీ సంఖ్యలో నెమళ్లు మృతి చెందాయి. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 53 నెమళ్లు మృతిచెందగా మరో 26 గాయపడ్డాయి. నెమళ్ల మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ దుర్ఘటనపై గ్రామసర్పంచ్ సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

శవపరీక్షలు నిర్వహించామని, ఫలితాలు వచ్చే వరకూ ఈ ఘటనపై స్పష్టత ఇవ్వలేమని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు. మృతిచెందిన నెమళ్లను నాగౌర్ జిల్లా ఎస్పీ దీద్వన సంజయ్ గుప్తా, అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఖననం చేశారు.

కొద్ది రోజుల క్రితం..

ఇటువంటి ఘటనే ఝలావాడ్​, జోధ్​పుర్ జిల్లాల్లో గురువారం జరిగింది. ఈ ఘటనలో 100 కాకులు నేలరాలాయి.ఈ ఘటనకు బర్డ్​ ఫ్లూ కారణమని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హై-సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ లాబోరేటరీ(ఎన్​హెచ్​ఎస్​ఏడీఎల్​) నిర్ధరించింది.

ఇదీ చూడండి :మావోయిస్టు దంపతులను కొట్టి చంపిన గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details