తెలంగాణ

telangana

By

Published : Apr 28, 2021, 2:27 PM IST

ETV Bharat / bharat

ఇంటి కప్పు కూలి ఐదుగురు మృతి

ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో జరిగింది.

house collapsed
మిర్జాపుర్, ఇంటి పైకప్పు

ఉత్తర్​ప్రదేశ్​ మీర్జాపుర్​లో విషాద ఘటన జరిగింది. కొత్వాలిలోని చోటీ గద్రీ ప్రాంతంలో ఓ ఇంటిపైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజమున 3 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు.

కూలిన ఇంటిపైకప్పు

ఉమాశంకర్, గదియా దంపతులతో సహా వారి ఇద్దరు తనయులు, ఓ కూతురు ఈ ఘటనలో మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. నిద్రలో ఉండగానే ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి
మృతదేహాలను బయటకు తీస్తున్న సహాయక బృందాలు

సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెతికితీశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మీర్జాపుర్​లో కూలిన ఇంటి పైకప్పు

ఇదీ చదవండి:దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు

ABOUT THE AUTHOR

...view details