తెలంగాణ

telangana

By

Published : Aug 8, 2021, 7:42 AM IST

ETV Bharat / bharat

ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురు మృతి

రాజస్థాన్​ నాగౌర్‌లోని కుచామన్‌లో ట్రక్కు, కారు ఢీ కొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ విచారం వ్యక్తం చేశారు.

road accident in nagaur in rajasthan today
ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలోని కుచామన్‌ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.

కుచామన్‌ పట్టణంలో రాత్రి రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. నాగౌర్‌ ఎంపీ హనుమాన్ బెనివాల్ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వారందరూ చురు జిల్లాలోని రాజల్‌ దేసర్ అనే గ్రామానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. వారు చురు నుంచి అజ్మీర్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందిని తెలిపారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు స్త్రీలు, ఇద్దరు మగవారు చనిపోయారు. తీవ్రగాయాలు కావడం వల్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి:ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details