తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు మృతి - rajasthan soil deaths

మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్​లోని ఝుంఝును జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు.

3-innocent-deaths-due-to-soil-subsidence-in-nawalgarh-of-jhunjhunu
మట్టిలో కూరుకుపోయి ముగ్గురు చిన్నారులు మృతి

By

Published : Mar 21, 2021, 8:05 AM IST

Updated : Mar 21, 2021, 8:39 AM IST

రాజస్థాన్​లోని ఝుంఝును జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మట్టిదిబ్బల్లో ఆడుకుంటున్న నలుగురు చిన్నారుల్లో ముగ్గురు ప్రమాదవశాత్తు మరణించారు. గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు

ఓ టన్నెల్ హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో వీరంతా ఆడుకుంటున్నారు. ఒక్కసారిగా కింద ఉన్న మట్టి కూరుకుపోవడం వల్ల చిన్నారులు అందులో చిక్కుకుపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో పోలీసులు

చిన్నారులు మట్టిలో గుంతలు తీస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వీరికి దూరంగా ఉన్న మరో బాలుడు ప్రమాదాన్ని గమనించి తల్లితండ్రులకు సమాచారం అందించాడు.

పోలీసుల సహాయక చర్యలు

ఇదీ చదవండి:కంబళ వీరుడు శ్రీనివాస గౌడ నయా రికార్డ్​

Last Updated : Mar 21, 2021, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details