తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2022, 5:39 AM IST

ETV Bharat / bharat

ఉద్యోగాల పేరుతో మోసం.. అశ్లీల నృత్యాలు చేయాలని!

మహిళలను ఉద్యోగాల పేరుతో మోసం చేసి వారి చేత అశ్లీల నృత్యాలు చేయాలని బలవంతం చేసిన ఓ ముఠాను అరెస్ట్​ చేశారు మధ్యప్రదేశ్​ పోలీసులు. బిహార్​ పోలీసుల సాయంతో నిర్వహించిన జాయింట్​ ఆపరేషన్​లో నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు వారి చెరలో ఉన్న నలుగురు మహిళలను రక్షించారు.

women
మహిళలు

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించింది ఓ ముఠా. మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్​ చేయగా పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు. నిందితుల చెర నుంచి నలుగురు మహిళలను రక్షించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జబల్​పుర్​కు చెందిన సన్నీ సొంధియా, నిధీ సొంధియా దంపతులు సహా దర్భంగాకు చెందిన పింటూ కుమార్​ ఠాకుర్​లు ఉద్యోగాల పేరుతో మహిళలను నమ్మించి వారిని బిహార్​కు తరిలించేవారు. ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అక్రమరవాణా చేస్తూ.. పెళ్లి వేడుకల్లో వారి చేత బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించేవారు. వీటిని పింటూ కుమార్​తో పాటు లవ్​కుష్​ రాయ్​, మహేశ్వర్​ శర్మ అలియాస్​ రామ్​ సాగర్​ అనే మరో ఇద్దరు నిందితులు నిర్వహించేవారు.

అయితే ఏప్రిల్ 11న ఈ ముఠా ముగ్గురు మహిళలను ఉద్యోగాల పేరుతో బిహార్​కు తరలించిందని జబల్​పుర్​ పోలీసులకు ఇటీవల సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు.. బిహార్​ పోలీసుల సాయంతో జాయింట్​ ఆపరేషన్​ నిర్వహించి మోతీహరీ ప్రాంతంలో నిందితులను అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న మహేశ్వర్​ శర్మ అలియాస్​ రామ్​ సాగర్​ కోసం గాలిస్తున్నారు. నిందితుల చెరలో ఉన్న నలుగురు మహిళలను రక్షించారు.

ఇదీ చూడండి :భార్య, మరదలిని హత్య చేసి.. ఇంట్లోనే దాచిపెట్టి..

ABOUT THE AUTHOR

...view details