ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్లో ఇద్దరు బాలికలు మృతి చెందడం కలకలం రేపుతోంది. జిల్లాలోని బాబురాహా గ్రామంలో ముగ్గురు బాలికలు పొలంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వారిని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో బాలికను కాన్పుర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
గ్రామానికే చెందిన ముగ్గురు బాలికలు పొలంలో గడ్డి తెచ్చేందుకు బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లారు. చీకటి పడినా బాలికలు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గాలించారు. చివరకు.. పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వారి కాళ్లు, చేతులు దుప్పట్టాతో కట్టేసి ఉన్నాయని, నోటి నుంచి నురగలు కూడా వచ్చాయని కుటుంబసభ్యులు చెప్పారు.