తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 3:10 PM IST

ETV Bharat / bharat

'సీపెక్'​ రక్షణ పేరుతో పాక్​-చైనా కుట్రలు!

సీపెక్​ రక్షణ, గస్తీ కోసం దాదాపు 25వేల మంది సైనికులను మోహరించేందుకు పాకిస్థాన్​-చైనా సిద్ధపడుతున్నాయి. వీరికి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా సమకూర్చనున్నాయి. భారత్​ను దృష్టిలో పెట్టుకునే ఇంత భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తున్నట్టు సమాచారం.

25,000 soldiers, artillery for China-Pak eco corridor
సీపెక్​ రక్షణకు భారీగా సైనికులు- ఆయుధాలు

సీపెక్​(చైనా-పాకిస్థాన్​ ఎకనామిక్​ కారిడర్​) కోసం చైనా-పాకిస్థాన్​ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కారిడర్​ రక్షణ కోసం ఇరుదేశాలు 25వేల సైనికులను మోహరించనున్నాయి. వీరికి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా సమకూర్చనున్నాయి.

పశ్చిమ చైనాలోని కష్గర్​ను అరేబియా సముద్ర తీర ప్రాంతమైన గ్వాడర్​ ఓడరేవుకు అనుసంధానించేదే ఈ సీపెక్​ ప్రాజెక్ట్​. ఇందులో భాగంగా 70బిలియన్​ డాలర్ల విలువగల రైల్వే, హైవే ప్రాజెక్టులను నిర్మించనుంది చైనా. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​తో పాటు పాకిస్థాన్​- భారత్​ సరిహద్దు వెంబడి దీనిని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్​తో హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గం చైనాకు దక్కతుంది. మరోవైపు సీపెక్​తో తమ దేశంలో మౌలికవసతులు వృద్ధి చెందుతాయని పాకిస్థాన్​ భావిస్తోంది.

ఇదీ చూడండి:-బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్​కు లాభం!

భారీ మోహరింపు ఎందుకు?

భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్​ఎస్​డీఎన్​(స్పెషల్​ సర్వీసెస్​ డివిజన్​ నార్త్​), ఎస్​ఎస్​డీఎస్​(స్పెషల్​ సర్వీసెస్​ డివిజన్​ సౌత్​) బలగాలను సీపెక్​ వెంబడి మోహరించనున్నాయి పాక్, చైనా. ఈ రెండు డివిజన్లలో మొత్తం ఆరుగురు బ్రిగేడియర్లు, పాకిస్థాన్​ కమాండర్లు, రేంజర్లు, ఫ్రాంటియర్​ కార్ప్స్​ పారామిలిటరీ దళాలు ఉండనున్నాయి.

ఇవన్నీ కలుపుకుని మొత్తం మీద 25వేల మంది సైనికులు సీపెక్​కు గస్తీ కాస్తారని సంబంధిత వర్గాలు ఈటీవీ భారత్​కు తెలిపాయి.

అయితే ఇంత భారీ స్థాయిలో బలగాల మోహరింపుపై ఆర్మీ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీపెక్​ కోసం ఎస్​ఎస్​డీకి భారీ స్థాయిలో ఆయుధాలను ఎందుకివ్వడం? ఒక్కో డివిజన్​లో బ్రిగేడియర్​ ఉండటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. బలోచి తిరుగుబాటుదారులను కలుపుకుంటే బలగాల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు.

ఇదీ చూడండి:-పాక్ ఉగ్ర చొరబాట్లకు చైనా 'డ్రోన్ సాయం'

భారత్​పై వ్యూహమే?

భారత్​ను దృష్టిలో పెట్టుకునే ఈ స్థాయిలో బలగాలను సిద్ధం చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో సంయుక్త కార్యకలాపాల కోసం ఈ బలగాలను పరీక్షించేందుకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఎస్​ఎస్​డీలకూ చైనానే నిధులు సమకూరుస్తోందని భావిస్తున్నట్టు తెలిపారు.

అయితే సీపెక్​ నిర్మాణంలో పనిచేస్తున్న చైనా కాంట్రాక్టర్లు కూడా ఆ దేశ మిలిటరీ, పారామిలిటరీ అధికారులేనని భారత సైన్యాధికారుల సమాచారం. వీళ్లే ఎస్​ఎస్​డీలకు ప్రణాళికలు రచించే అవకాశముందని భావిస్తున్నారు.

పాక్​-చైనా దోస్తీ..

పాక్​-చైనా మధ్య మైత్రి మరింత బలపడుతోంది. పాకిస్థాన్​కు అన్ని విధాలుగా అండగా ఉంటోంది. చైనా రూపొందించిన జలాంతర్గాములు(టైప్​ 039ఏ యాన్​).. 2022లో పాకిస్థాన్​కు చేరుకుంటాయి. మొత్తం మీద 8 జలాంతర్గాములు పాకిస్థాన్​ నావికాదళానికి అందనున్నాయి. భారత అపాచీకి దీటుగా.. చైనా నుంచి జెడ్​-10 హెలికాప్టర్లను కొనుగోలు చేసింది పాక్​.

(రచయిత-సంజీవ్ బారువా, సీనియర్​ పాత్రికేయులు)

ఇదీ చూడండి:-చైనా పెట్టుబడుల రక్షణకే.. పాక్ పన్నాగాలు!

ABOUT THE AUTHOR

...view details