బంగాల్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 25శాతం మందిపై క్రిమినల్ కేసులున్నట్లు అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తెలిపింది. మార్చి 27న జరిగే ఎన్నికల బరిలో నిలిచే 191 మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాలను ఏడీఆర్, పశ్చిమ్బంగా ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విశ్లేషించాయి. అందులో 48 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించారని ఆ నివేదిక పేర్కొంది.
నేర చరిత్ర..
⦁ 48 మంది(25%) అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో.. సీపీఐ(ఎం) నుంచి 10, భాజపా 12, తృణమూల్ 10, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఉన్నారు.
⦁ 42 మంది (22%)పై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. వారిలో సీపీఐ(ఎం) నుంచి 9, భాజపా 11, తృణమూల్ 8, ఒకరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు.
⦁ మహిళలపై నేరాల కేసులు 12 మందిపై, ఒకరిపై అత్యాచారం కేసు, 8 మందిపై హత్య కేసులున్నాయి.