తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు.. బోగీలు చెల్లాచెదురు

ఉత్తర్​ప్రదేశ్​లో 24 బోగీల గూడ్స్​ రైలు పట్టాలు (Train Derailment) తప్పింది. అంబియాపుర్​ వద్ద అదుపు తప్పడం వల్ల బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై (Goods Train Derailed in UP) చెల్లాచెదురుగా పడ్డాయి.

By

Published : Oct 15, 2021, 3:19 PM IST

Updated : Oct 15, 2021, 4:14 PM IST

train derailment
train derailment

ఉత్తర్​ప్రదేశ్​లో పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

ఉత్తర్‌ప్రదేశ్‌ లఖ్‌నవూలో గూడ్స్‌ రైలు పట్టాలు (Train Derailment) తప్పి ప్రమాదానికి గురైంది. దిల్లీ- హౌడా రైల్వే లైనులోని అంబియాపుర్‌ వద్దకు రాగానే 24 బోగీలతో వెళ్తున్న ఖాళీ గూడ్స్‌ రైలు (Goods Train Derailed in UP) అదుపుతప్పింది. దీంతో బోగీలు ఒకదానికొకటి ఢీకొని పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

పట్టాలు తప్పిన గూడ్స్​ రైలు

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.

రైలు ప్రమాదం

కాన్పుర్‌ రైల్వేస్టేషన్‌కు 50కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం (UP Derailment) జరగగా, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలపై ఉన్న బోగీలను తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

బోగీలు చెల్లాచెదురు

ఇప్పటికే పలు రైళ్లను మళ్లించిన రైల్వే అధికారులు రాకపోకలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాకపోకల పునరుద్ధరణకు యత్నిస్తున్న సిబ్బంది

ఇదీ చూడండి:ఘోర రోడ్డు ప్రమాదం.. ఫ్లైఓవర్​పై నుంచి బస్సు బోల్తా

Last Updated : Oct 15, 2021, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details