దేశవ్యాప్తంగా.. 1901 నుంచి ఇప్పటివరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాల్లో 2020 ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయితే.. 2016లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. 2020లో వేడి గణనీయంగా తగ్గిందని భారత వాతావారణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. కానీ గత రెండు దశాబ్దాల్లో ఉష్ణోగ్రతలు(0.23, 0.34 డిగ్రీల సెల్సియస్) పెరిగాయని పేర్కొంది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. 1901 నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదైన 15 సందర్భాలను తీసుకుంటే.. వాటిలోని 12 సంవత్సరాలు- గత 15 ఏళ్లలో(2006-2020)లోనే ఉండటం గమనార్హం. 1901-2020లో దేశ సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.62 డిగ్రీ సెల్సియస్కు పెరిగిందని ఐఎండీ తెలిపింది. ఈ వివరాల ఆధారంగా దేశవ్యాప్త సగటు భూ ఉపరితల ఉష్ణోగ్రత.. సాధారణం కంటే 0.29 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
2020లో 1565మంది బలి..