తమిళనాడులో ఓ 19 ఏళ్ల యువతిపై పోక్సో చట్టం(pocso act) కింద కేసు నమోదైంది. మైనర్ బాలుడితో వివాహం చేసుకున్నందుకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు.
కథేంటంటే?
తమిళనాడు పొల్లాచికి చెందిన 19 ఏళ్ల యువతి ఓ పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో 17 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి పెట్రోల్ స్టేషన్కు వెళ్లడం అలవాటు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ.. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది.
అయితే, ఆ యువతికి ఇంట్లో పెద్దలు పెళ్లికి ఏర్పాటు చేశారు. ఈ సమయంలో యువకుడు ఓ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరాడు. దీంతో యువతి ఆస్పత్రికి వెళ్లి పెళ్లి సంబంధాల గురించి యువకుడికి చెప్పింది. 'పెద్దలు నిశ్చయించిన పెళ్లికి ముందే మనం వివాహం చేసుకుందాం' అని యువకుడిని ఒప్పించింది. వెంటనే ఓ గుడికి తీసుకెళ్లి వివాహం చేసుకుంది.