తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైలెక్కి సెల్ఫీకి యత్నం- విద్యుదాఘాతంతో..!

సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ తీసుకుందామని 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కాడు. విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. వెంటనే స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

By

Published : Apr 15, 2021, 4:59 PM IST

electrocuted
విద్యుదాఘాతం

సెల్ఫీ తీసుకుందామని ఓ 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జోకట్టే రైల్వే స్టేషన్​లో జరిగింది. బాధితుడిని మహ్మద్​ దిశాన్​గా పోలీసులు గుర్తించారు. అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

కాలిన గాయాలతో మహ్మద్​ దిశాన్

దిశాన్ శరీరం 50 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:సీబీఐకి ఇస్రో గూఢచర్యం కేసు

ABOUT THE AUTHOR

...view details