సెల్ఫీ తీసుకుందామని ఓ 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కగా.. విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని జోకట్టే రైల్వే స్టేషన్లో జరిగింది. బాధితుడిని మహ్మద్ దిశాన్గా పోలీసులు గుర్తించారు. అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
రైలెక్కి సెల్ఫీకి యత్నం- విద్యుదాఘాతంతో..! - సెల్ఫీ సరదా
సెల్ఫీ సరదా ఓ బాలుడి ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ తీసుకుందామని 16 ఏళ్ల బాలుడు రైలు పైకి ఎక్కాడు. విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. వెంటనే స్థానికులు అతడ్ని ఆసుపత్రికి తరలించారు.
![రైలెక్కి సెల్ఫీకి యత్నం- విద్యుదాఘాతంతో..! electrocuted](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11412955-620-11412955-1618481978001.jpg)
విద్యుదాఘాతం
దిశాన్ శరీరం 50 శాతం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:సీబీఐకి ఇస్రో గూఢచర్యం కేసు