తెలంగాణ

telangana

ETV Bharat / bharat

16 లక్షల దీపాల వెలుగులో మెరిసిన అంజన్న - పిత్ర్​ పర్వత్ హనుమాన్​ ఆలయం

ప్రపంచంలోనే అతిపెద్ద దీపదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగిన ఈ వేడుకలో సుమారు 16 లక్షల దీపాలను వెలిగించారు.

16 lakh earthen lamps lit in Indore; Kailash Vijayvargiya, others participate
ప్రపంచంలోనే అతిపెద్ద దీపదాన మహోత్సవం

By

Published : Mar 1, 2021, 1:28 PM IST

ఇండోర్​లో దీపదాన మహోత్సవం

ప్రపంచంలోనే అతిపెద్ద దీపదాన మహోత్సవం మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జరిగింది. దీనిని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ నిర్వహించారు. ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 16 లక్షల దీపాలను వెలిగించారు.

కైలాశ్ విజయవర్గీయ

ఈ వేడకకు ఇండోర్​లోని పిత్ర్​ పర్వత్ హనుమాన్​ ఆలయం వేదికైంది. అయోధ్యలోని రామమందిరానికి అర్పించిన ఈ దీపాలను తొలుత సాధువులు వెలిగించగా.. అనంతరం కైలాశ్, భక్తులు జ్యోతులను ముట్టించారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు దీపాల వెలుగులో శోభాయమానంగా మారాయి. ఈ గుడిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అష్టలోహ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకున్నారు భక్తులు.

అష్టలోహ ఆంజనేయ స్వామి

వేడుకలో విజయ వర్గీయ సహా ఆయన కుమారుడు, ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ హనుమాన్​ చాలిసా పఠించారు. ఆస్పత్రిలో ఉన్న ఎంపీ నందకుమార్​ సింగ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్నారు. ఆంజనేయుడు అందరికీ మంచి చేయాలని వేడుకున్నారు.

దీపాలు వెలిగిస్తున్న మహిళ

ఇదీ చూడండి:కొవాగ్జిన్ టీకాతో మోదీ ఇచ్చిన సందేశమేంటి?

ABOUT THE AUTHOR

...view details