తెలంగాణ

telangana

'ఈ ఏడాది మరో 14 అంతరిక్ష ప్రయోగాలు'

By

Published : Feb 28, 2021, 7:29 PM IST

ఈ ఏడాది చివర్లో మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 14 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు.

14 missions lined up for launch in 2021: ISRO chairman
కే శివన్​

ఈ ఏడాది చివరినాటికి మానవ రహిత అంతరిక్ష యాత్ర సహా మొత్తం 14 ప్రయోగాలు చేపట్టనున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్‌ శివన్‌ వెల్లడించారు. పీఎస్​ఎల్​వీ సీ-51 వాహకనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఏడు వాహకనౌకలు, ఆరు ఉపగ్రహ ప్రయోగాలు సహా ఈ ఏడాది చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్‌ లక్ష్యంగా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నట్లు శివన్​ తెలిపారు. గగన్‌యాన్‌కు ముందు రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టాలని ఇస్రో యోచిస్తోందన్నారు. ఇస్రో నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2022లో గగన్‌యాన్‌ మిషన్‌ ద్వారా ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ మిషన్‌కు ఎంపికైన నలుగురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు.

ఇదీ చదవండి:'మంగళ్​యాన్​-2 సైతం ఒక ఆర్బిటరే​'

ABOUT THE AUTHOR

...view details