తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ​ జలప్రళయంలో 130 మంది గల్లంతు'

ఉత్తరాఖండ్​లో ఫిబ్రవరి 7న హిమానీనదులు కట్టలు తెంచుకుని సృష్టించిన జలప్రళయానికి 130మంది గల్లంతయ్యారని కేంద్రం తెలిపింది. మరో 74మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

By

Published : Mar 23, 2021, 3:53 PM IST

130 people still missing in Uttarakhand glacial burst: Govt
ఉత్తరాఖండ్​ జలప్రళయం- 130మంది గల్లంతు

ఉత్తరాఖండ్​లో ఫిబ్రవరి 7న హిమానీనదులు కట్టలు తెంచుకుని సృష్టించిన జలవిలయంలో 130 మంది గల్లంతయ్యారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మరో 74మంది మృతదేహాలను కనుగొన్నట్లు వెల్లడించింది.

లోక్​సభలో ఈ మేరకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్​ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ఇదివరకే ప్రకటించినట్లు గుర్తుచేశారు.

విపత్తుకు కారణాలను తెలుసుకోవడానికి నిపుణలతో కేంద్రం ఓ కమిటీని వేసినట్లు తెలిపారు నిత్యానంద్. రాష్ట్రప్రభుత్వం కూడా ఓ కమిటీని వేసినట్లు వివరించారు.

ఇదీ చూడండి:జలప్రళయం మిగిల్చిన విధ్వంస చిత్రమిది..

ABOUT THE AUTHOR

...view details