కవల పిల్లలను చూస్తేనే ముచ్చట పడిపోతుంటాం. అందులోనూ పాఠశాలలో కవలలు ఉంటే వారు ఆ స్కూల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటిది కర్ణాటకలోని ఓ పాఠశాల కవల విద్యార్థులకు కేరాఫ్గా మారింది. ఒకటి కాదు, రెండు కాదు ఆ పాఠశాలలో ఏకంగా 11 కవల జంటలు ఉన్నాయి. వీరంతా 4వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్నారు.
దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు శివార్లలోని కైరంగల పుణ్యకోటి నగరాలో ఉన్న.. శారద-గణపతి విద్యాకేంద్రం స్థానికంగా కవల పిల్లల స్కూల్గా ప్రత్యేక గుర్తింపు పొందింది.
నాలుగో తరగతిలో జైనేశ్-జయేశ్, సంజన-సంజయ్, లతేశ్-లవేశ్లు.. ఐదో తరగతిలో చైతన్య పి.మల్లి-చందన పి.మల్లి, ధన్యశ్రీ-ధనుష్లు ఉన్నారు. ఆరో తరగతిలో భవశ్రీ-దివ్యశ్రీ, కీర్తి ఆర్.గట్టీ-కీర్తన్ ఆర్.గట్టీ, ఏడో తరగతిలో సుజన్-సుహాన్, పదో తరగతిలో శ్రీశాంత్-సుహాంత్లు జంటలు ఉన్నాయి. 12వ తరగతిలో ప్రజ్ఞ-ప్రేక్ష, మోక్ష-మోక్షిత జంటలు విద్యను అభ్యసిస్తున్నారు.