తెలంగాణ

telangana

ETV Bharat / bharat

102 Year Old Woman Postal Ballot : ఓటేసిన 102 ఏళ్ల బామ్మ.. ఇంటి నుంచే.. - ఛత్తీస్​గఢ్​ ఎన్నికలు 2023

102 Year Old Woman Postal Ballot : ఛత్తీస్​గఢ్​లో ఓ 102 ఏళ్ల బామ్మ.. ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్​ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటేశారు.

102 Year Old Woman Postal Ballot
102 Year Old Woman Postal Ballot

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 9:20 AM IST

102 Year Old Woman Postal Ballot : ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో ఓ 102 ఏళ్ల వృద్ధురాలు.. పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటేశారు. ఇంటి నుంచే గురువారం.. బుధియారి కౌడన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఆమెతోపాటు మరో 57 మంది పోస్టల్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేశారు.

కాంకేర్​ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 306 మంది 80 ఏళ్ల పైబడిన వారు, దివ్యాంగులు.. ఉన్నట్లు పోలింగ్​ అధికారి శిఖర్​ సోనీ తెలిపారు. కంకేర్ అసెంబ్లీలో 80 ఏళ్ల పైబడిన వారు 53 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 22 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. అంతగఢ్​ అసెంబ్లీలో 80 ఏళ్ల పైబడిన వారు 31 మంది.. ఐదుగురు దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. భానుప్రతాప్‌పుర్‌లో 80 ఏళ్ల పైబడిన వారు 169 మంది ఉండగా.. 26 మంది దివ్యాంగులు ఉన్నారు. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 58 ఓట్లు పోలయ్యాయి.

పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్న బుధియారి కౌడన్

అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు..
ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించడం వల్ల అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నుంచే ఓటేస్తున్నారు. అందుకోసం పలు విధివిధానాలను అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా వృద్ధులు, వికలాంగులు ఈ విషయాన్ని వారి ప్రాంతంలోని బూత్ లెవల్ ఆఫీసర్​కు తెలియజేయాలి.

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే వారిని ముందుగా బూత్‌స్థాయి అధికారులు గుర్తించి వారి ఇంటికి వెళ్లి ఫాం 12డీని అందజేస్తారు. అధికారులు అందజేసిన ఫాం 12డీని ఓటర్లు పూరించి తిరిగి బీఎల్‌వోలకు అందజేస్తారు. ఈ దరఖాస్తులను బీఎల్‌వోలు ఆర్‌వోలకు అందజేస్తారు. దరఖాస్తుల ఆధారంగా వయోవృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిస్తారు. అయితే ఇందులో ఎవరైనా పోలింగ్‌ కేంద్రానికే వచ్చి ఓటు వేస్తానని చెబితే వారికి 12డీ దరఖాస్తులు ఇవ్వరు. వారు నేరుగా పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. పోలింగ్‌ కేంద్రాల్లోనూ దివ్యాంగులకు ర్యాంపులు, వయోవృద్ధులకు చక్రాల కుర్చీలు అందుబాటులో ఉంటాయి.

ఓటరు రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సులో..
ఎవరైతే ఫాం 12డీ పూరించి ఇంటి వద్దనే ఓటు వేయాలని దరఖాస్తు చేసుకుంటారో అలాంటి వారి ఇంటికి ఎన్నికల సిబ్బంది మొబైల్‌ వ్యాన్‌లో చేరుకుంటారు. ఇందులో ఇద్దరు పోలింగ్‌ అధికారులు, ఓ వీడియోగ్రాఫర్‌, మరో రక్షణ అధికారి ఉంటారు. ఇక్కడ ఓటరుకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేస్తారు. అధికారులు నిర్దేశించిన పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లో ఓటరు రహస్యంగా ఓటు వేసి బ్యాలెట్‌ బాక్సులో వేస్తాడు. ఈ ప్రక్రియను అధికారులు పూర్తిగా చిత్రీకరిస్తారు. ఈ ప్రక్రియ సాధారణ ఎన్నికలకు ఒక రోజు ముందుగానే పూర్తి చేస్తారు.

Chhattisgarh Election 2023 :ఛత్తీస్​గఢ్​లో నవంబర్​ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోడానికి కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా? బీజేపీ గాడిన పడుతుందా? అనేది తెలియాలంటే డిసెంబర్​ 3వ తేదీవరకు వేచి చూడాల్సిందే.

Chhattisgarh Assembly Election 2023 Prediction : ఛత్తీస్​గఢ్​లో హోరాహోరీ.. బఘేల్​పై కాంగ్రెస్ నమ్మకం..​ మోదీపైనే బీజేపీ ఆశలు.. గెలుపెవరిది?

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​ వైపే గాలి! బీజేపీ అద్భుతం చేస్తుందా?

ABOUT THE AUTHOR

...view details