ఆంధ్రప్రదేశ్

andhra pradesh

World_Photography_Day_Celebrations

ETV Bharat / videos

World Photography Day Celebrations in Vijayawada: "ఫొటో లేకుండా పేపర్​ చదివితే ఫొటో జర్నలిజం విలువ తెలుస్తుంది"​

By

Published : Aug 19, 2023, 5:04 PM IST

World Photography Day Celebrations in Vijayawada: వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా విజయవాడ ప్రెస్​క్లబ్​లో ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శనను ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్​ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం ఫొటో పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ.. ఫొటో లేకుండా పేపర్ చదివితే ఫొటో జర్నలిజం విలువ తెలుస్తుందని, ఫొటో చూసే ఆ వార్తను మనం అర్ధం చేసుకోవచ్చన్నారు. ఫొటోగ్రఫీకి అంత ప్రాధాన్యత ఉందన్నారు. ఫొటో జర్నలిస్టుల కోసం లక్ష రూపాయలు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం 15 లక్షల రూపాయల నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ ప్రెస్​క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు భరోసా ఇచ్చారు. జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్నా తమ దగ్గరికి వస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details