By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2023, 3:43 PM IST
TDP Leader Gorantla Butchaiah on Chandrababu: 'అవినీతి మరక కాసేపు మాత్రమే.. శునకానందం తాత్కాలికం': బుచ్చయ్య చౌదరి
TDP Leader Gorantla Butchaiah on Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్, జ్యూడీషియల్ కస్టడీపై.. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కీలక విషయాన్ని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారంటూ బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు. వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, మర్రి చెన్నా రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు అని ఆయన గుర్తు చేశారు.
Butchaiah Chaudhary Tweet on Chandrababu Arrest: టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన ట్వీట్లో.. ''రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు.. టంగుటూరి ప్రకాశం పంతులు, మర్రి చెన్నా రెడ్డి, ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు. అవినీతి మరక కాసేపు మాత్రమే. శునకానందం తాత్కాలికం.'' అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటికి వస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు.