ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రైలు ఎక్కిస్తానని నమ్మించి గొంతుకోశాడు - కన్నతల్లిని హతమార్చిన తనయుడు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 12:51 PM IST

Son_Killed_Mother

Son Killed Mother: ఆస్తి వివాదం కారణంగా కన్నతల్లినే దారుణంగా హత్య చేశాడో కుమారుడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చీరాల మండలం పుల్లాయిపాలెంకి చెందిన వెంకటరత్నం(60) రైళ్లలో తినుబండారాలు అమ్మి జీవనం కొనసాగించేది. భర్త అనారోగ్యం కారణంగా చేసిన అప్పులను తీర్చేందుకు తన పేరిట ఉన్న పొలాన్ని విక్రయించాలని అనుకుంది. దీనికి పెద్ద కుమారుడు శివయ్య ససేమిరా అన్నాడు. ఆస్తిని కుమార్తెకు కట్టబెడుతున్నావంటూ తల్లిపై నిందలు వేశాడు. కుమారుడు మాట ఖాతరు చేయని తల్లి పొలం అమ్మేందుకు మొగ్గు చూపారు. 

Son Stabbed Mother to Death for Property: దీంతో తల్లిపై కోపం పెంచుకున్న కుమారుడు తరచూ గొడవ పడేవాడు. ఆమెను ఎలాగైనా హతమార్చాలాని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లుగానే.. తల్లి వ్యాపారం నిమిత్తం వెదుళ్లపల్లి వరకు తీసుకువెళ్లి రైలు ఎక్కిస్తానని నమ్మబలికాడు. కుమారుడి దురుద్దేశం గ్రహించని తల్లి అతడి బైక్ ఎక్కింది. ఇదే అదునుగా భావించిన కుమారుడు.. మార్గమధ్యలో కత్తితో ఆమె మెడపై పొడిచాడు. దీంతో ఆమె కొద్దిసేపు పెద్దగా అరుస్తూ.. అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

ABOUT THE AUTHOR

...view details