ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ramachandra_yadav_on_peddireddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2023, 7:24 PM IST

ETV Bharat / videos

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఓటమి ఖాయమైపోయింది: రామచంద్ర యాదవ్

Ramachandra Yadav on Peddireddy Ramachandra Reddy:పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి ఖాయమైపోయిందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు. ఓటమిని పెద్దిరెడ్డి ఒప్పుకున్నందునే ఇతర ఆలోచనలు చేస్తున్నారని అందుకే తాము పెద్దిరెడ్డిని పుంగనూరు నుంచే పోటీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. వెనకబడిన తరగతుల్లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తామంటూ 2019కి ముందు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇచ్చిన మాట తప్పారన్నారు. 

వాల్మీకి సమాజం చాలా వెనకబడి ఉందని, వారి ఆకాంక్షల సాధన కోసం జనవరి 20వ తేదీన కర్నూలులో వాల్మీకి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి చివరిలోగా తమ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు అభ్యర్ధులను ఖరారు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం వచ్చిందని, ప్రజలు జగన్​కు తగిన బుద్ది చెప్తారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details