ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Political Leaders Meet With JSP Chief Pawan Kalyan

ETV Bharat / videos

పవన్ కళ్యాణ్​ను కలిసిన పలువురు నేతలు- తాజా రాజకీయాలపై చర్చ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2024, 12:29 PM IST

Political Leaders Meet With JSP Chief Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్​ను గురువారం పలువురు రాజకీయ నేతలు కలిశారు. మాజీమంత్రి కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ విజయం సాధించాలని రామ జోగయ్య ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ మాగంటి బాబు పవన్ కళ్యాణ్‌ను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప సభాపతి బూర గడ్డ వేదవ్యాస్ పవన్ కళ్యాణ్​తో సమావేశమయ్యారు.  ఈ భేటీలో పలు కీలక రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన పార్టీలు కలిసి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం- జనసేన పొత్తు పదేళ్లయినా ఉండాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గతంలో అన్నారు. సంక్రాంతి తర్వాత తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కి రానున్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇరుపార్టీలు ముందడుగు వేయనున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details