ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police_Case_on_YCP_Leader_in_Prakasam_District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 2:49 PM IST

ETV Bharat / videos

పార్టీ అండతో భూ ఆక్రమణలు - వైసీపీ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు

Police Case on YCP Leader in Prakasam District: రాష్ట్రంలో భూమి కనిపిస్తే వైసీపీ నేతలు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నా ఆక్రమణలు ఆగడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీ 9వ వార్డ్ వైసీపీ కౌన్సిలర్ మొఘల్ సిరాజ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కాపురం మండలం గోగులదిన్నే గ్రామంలో శివారెడ్డి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 72/2, 75/1లో 4.20 ఎకరాల భూమి తమదంటూ కౌన్సిలర్ సిరాజ్​ దౌర్జన్యానికి దిగారని పోలీసులకు పిర్యాదు చేశారు. 

తన పొలంలో అక్రమంగా దిగి కంచెను నష్టపరచడమే కాకుండా తమపై దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వైసీపీ కౌన్సిలర్​పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సదరు వైసీపీ నేత సిరాజ్ అధికార పార్టీ అండదండలతో గతంలోనూ పలు భూ అక్రమాలకు పాల్పడ్డారని పిర్యాదులు ఉన్నట్లు తెలిసింది. 

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details