ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ganesh Temple Trustee fires on Mayor Manohar Naidu

Ganesh Temple Trustee fires on Mayor Manohar Naidu వైసీపీ నేత కక్ష సాధింపుతో 50 ఏళ్ళుగా సాగుతున్న గణేష్ ఉత్సవాలు నిలచిపోయాయి: ఆలయ ధర్మకర్త ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 4:36 PM IST

Published : Sep 24, 2023, 4:36 PM IST

Ganesh Temple Trustee fires on Mayor Manohar Naidu: మేయర్ కావటి మనోహర్ నాయుడు కక్ష సాధింపుల వల్ల 50 ఏళ్లుగా చేస్తున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాల్ని ఈ ఏడాది నిర్వహించలేకపోయామని గుంటూరు శ్రీనివాసరావుపేట వినాయక ఆలయ ధర్మకర్త చల్లా సాంబశివరావు ఆరోపించారు. ఆలయం ప్రారంభం నుంచి రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ వేడుకలకు తనను ఆహ్వానించలేదని.. కక్ష పెంచుకున్న మేయర్ నాటి నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తన కాంప్లెక్స్ గదులకు నోటీసులు సైతం పంపించారని వాపోయారు. గతేడాది వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నదానానికి సర్వం సిద్ధం చేసుకుంటే.. అప్పటికప్పుడు మురికి కాలువ కల్వర్ట్ పగులకొట్టి.. ఇబ్బంది కలిగించారని తెలిపారు. మేయర్​తో రాజీ చేసుకోవాలని అధికారులతో రాయబారం పంపారని పేర్కొన్నారు. కాపు సామాజిక వర్గానికి అండగా లేరని పవన్ మీద విమర్శలు చేస్తున్న కావటి మనోహర్ నాయుడు.. అదే కాపు సామాజిక వర్గానికి చెందిన తాను వినాయక ఉత్సవాలు నిర్వహిస్తుంటే అడ్డుకోవడమేంటని వినాయక ఆలయ ధర్మకర్త చల్లా సాంబశివరావు నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details