By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 12, 2024, 7:40 PM IST
మదనపల్లె మున్సిపల్ సమావేశం రసాభాస - పాలకపక్షం కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం
Clash in Madanapalle Municipal Council Meeting:అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పాలకపక్షం కౌన్సిలర్లు ఒకరినొకరు పరస్పరం దూషించుకున్నారు. మదనపల్లి పురపాలక సంఘం కౌన్సిల్ హాలులో బడ్జెట్ సమావేశం జరగగా అభివృద్ధి పనులపై చర్చ చేసినందుకు కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి అభ్యంతరం తెలిపారు. 16 వార్డు కౌన్సిలర్ దీన్ని తీవ్రంగా ఖండించి బడ్జెట్ పైనే మాట్లాడాలనే సిద్ధాంతం లేదని కౌన్సిలర్గా సమస్యపై మాట్లాడొచ్చని నీవు నియంత్రణ చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కౌన్సిల్ సమావేశం జరిగేది కేవలం బడ్జెట్ గురించి మాత్రమే కాదని, వార్డుల్లో ఉన్న సమస్యలు గురించి చర్చించుకునేందుకు కూడా జరుగుతుందని అన్నారు. సమావేశంలో తమ సమస్యలు గురించి చెప్పకుండా కేవలం మీరు చెప్పేది వినడానికి మాత్రమే అయితే మేము ఎందుకు రావడం అని ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ పెద్దది కానున్న నేపథ్యంలో తోటి కౌన్సిలర్లు ఇరువురికి సర్ది చెప్పారు. అనంతరం బడ్జెట్ సమావేశం కౌన్సిల్ ఆమోదం పొందింది