కడప జిల్లా పెనగలూరు మండలంలో బెస్తపల్లికి చెందిన సుబ్బరాయుడు, భారతి దంపతులు ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. తమ కుమారుడు సతీష్ను ఉక్రెయిన్లో డాక్టర్ చదివిస్తున్నారు. కొద్ది రోజుల కిందట బ్రైయిన్ ఇన్ఫెక్షన్తో సతీశ్ మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు తెలియచేశారు. ఈ విషాద ఘటన తెలుసుకున్న వారు తల్లడిల్లిపోయారు. లాక్ డౌన్ కారణంగా భారతి, సుబ్బరాయుడు ఇండియాకు రాలేకపోయారు. ప్రభుత్వం చొరవతో బిడ్డను చూడటానికి తల్లిని మాత్రేమే అనుమతించారు. ఇండియాకు వచ్చిన ఆమెకు కరోనా పాజిటివ్ రావటంతో ఐసోలేషన్కి తరలించారు. తమ బిడ్డ సతీష్ను చివరిచూపు చూసేందుకు కువైట్ నుంచి వచ్చినా తల్లిని అనుమతించలేదు. చివరికి బంధువుల సమక్షంలో సతీష్ అంత్యక్రియలు పూర్తి చేశారు.
డాక్టర్గా చూడాలనుకున్నారు... కానీ కడసారి చూడలేకపోయారు
తమ కుమారుడిని డాక్టర్గా చూడాలన్న ఆ తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. వైద్యునిగా పలువురికి వైద్యం అందించాల్సిన బిడ్డే... బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో చనిపోవటంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. చివరికి బిడ్డను కడసారైన చూడటానికి వీలులేక పోవటంతో వారి రోదనలు మిన్నంటాయి.ఈ విషాద ఘటన కడప జిల్లా పెనగలూరు మండలంలో జరిగింది.
డాక్టర్గా చూడాలనుకున్న కొడుకుని... కడసారి చూడలేకపోయారు