ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 28, 2021, 8:36 AM IST

ETV Bharat / state

పరిసరాల పరిశుభ్రతలో.. వైవీయూ ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్లు

జాతీయ సేవా పథకంలో భాగంగా.. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం శివాజీ నగర్​లో వారం రోజులపాటు యోగి వేమన విశ్వవిద్యాలయానికి చెందిన వాలంటీర్లు పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. శివాజీ నగర్​లోని పరిసరాలను శుభ్రం చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

nss volunteer
ఎన్​ఎస్​ఎస్​ వాలంటీర్లు

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం శివాజీ నగర్​లో వారం రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా యోగి వేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. గ్రామంలోని ఆలయం పరిసరాలను, వైవీయూ గురుకుల భవనాలు, బొటానికల్ గార్డెన్ పరిసరాలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలను తొలగించారు.

వైవీయూఎస్ఎస్ యూనిట్- 1, 3 ప్రోగ్రామింగ్ ఆఫీసర్లు డాక్టర్ పి.సరిత, డాక్టర్ పి.వి. వర ప్రభాకర్​ పర్యవేక్షించారు. స్థానికులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం శివాజీనగర్​లో ర్యాలీ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details