ఎన్నికల అధికారికి వైకాపా ఫిర్యాదు
ఓటరు సవరణ పేరుతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్నికల అధికారికి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు.
ఓటరు సవరణ పేరుతో తెదేపా రాజకీయాలు చేస్తోందని వైకాపా నేతలు ఆరోపించారు. ప్రొద్దుటూరు ఎన్నికల అధికారి బాల గణేశయ్యను కలిసి ఫిర్యాదు చేశారు. వైకాపా నేతల పేరుతో.. సాంకేతికతను ఉపయోగించుకుని ఫిర్యాదు చేస్తున్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.
దోషులపై సరైన నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11వ వార్డులో మాజీ కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి పేరుతో 70 ఓట్లు తొలగించారని.. ఇందులో ఆమె ప్రమేయం లేదని వివరించారు. అనర్హత ఓటర్లను తొలగించాలంటూ అనేక సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటంలేదని ఆరోపించారు.