అక్రమంగా చేపలు రవాణా అవుతున్న రెండు వాహనాలను కడప జిల్లా బద్వేలు రెవెన్యూ అధికారులు పోలీసులు సంయుక్తంగా ఈరోజు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 200 కిలోల చేపల రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.సోమశిల వెనుక జలాల్లో నిషేధిత కాలంలో చేపల వేట సాగిస్తున్నారు. పట్టుకున్న చేపలను ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వాహనాల్లో అక్రమరవాణా చేస్తున్నారు. ప్రజల నుంచి రాబడిన సమాచారం మేరకు పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు నిఘాపెట్టి పట్టుకున్నారు. వాహనాలు నడిపే ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
అక్రమంగా చేస్తున్న చేపల రవాణను పట్టుకున్న.. పోలీసులు
కడప జిల్లా బద్వేలులో అక్రమంగా చేపలు రవాణా అవుతున్న రెండు వాహనాలను రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా ఈరోజు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. 200 కిలోల చేపల రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
చేపల రవాణను పట్టుకున్న.. పోలీసులు