కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలో పేదలకు వైకాపా నాయకులు కేజీ బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటిస్తూ, ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు లాక్డౌన్ వలన ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే కూరగాయలు పంపిణీ చేసినట్లు వైకాపా నాయకుడు మమ్ముసిద్ధిపల్లె శివ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ, అధికారులకు ప్రజలు సహకరించాలని అన్నారు.
పేదలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ
కడప జిల్లా పెండ్లిమర్రిలో పేద ప్రజలకు వైకాపా నాయకులు బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని వారు సూచించారు.
పెండ్లిమర్రిలో పేదలకు కూరగాయలు పంపిణీ