ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 2, 2020, 11:48 PM IST

ETV Bharat / state

హెల్త్ బులిటెన్ ప్రకటనలో వ్యత్యాసం..!

కడప జిల్లాలో ఈరోజు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో వ్యత్యాసం కనిపించింది. రాష్ట్ర హెల్త్​ బులిటెన్​లో కొత్తగా 4 పాజిటివ్ కేసులు నమోదైనట్లు చూపించగా... కడప జిల్లా వైద్యారోగ్య శాఖ ఒక్క కేసు మాత్రమే పెరిగినట్లు ప్రకటనలో వెల్లడించింది.

హెల్త్ బులిటెన్ ప్రకటనలో వ్యత్యాసం
హెల్త్ బులిటెన్ ప్రకటనలో వ్యత్యాసం

అధికారుల తప్పిదాల వల్ల కడప జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యలో వ్యత్యాసం కనిపించింది. ఇవాళ ఉదయం విడుదల చేసిన రాష్ట్ర హెల్త్​ బులిటెన్​లో కొత్తగా 4 పాజిటివ్ కేసులతో కలిపి జిల్లాలో 83కి చేరినట్లు పేర్కొన్నారు. కానీ కడప జిల్లా వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన దాంట్లో ఇవాళ ఒక్క కేసు మాత్రమే పెరిగినట్లు తెలిపారు. మొత్తం పాజిటివ్ కేసులు 80గా చూపించారు. రాష్ట్ర హెల్త్ బులిటెన్​కు పొరపాటుగా సమాచారం ఇచ్చామని... వైద్యారోగ్య శాఖ వివరణ ఇస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి:తిండి కరువైంది సారూ... స్వస్థలాలకు పంపించండి

ABOUT THE AUTHOR

...view details