ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీవో-12 లక్ష్యమదే: తులసిరెడ్డి

By

Published : May 22, 2020, 4:32 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రాహ్మణ, కాపు, మైనార్టీ, క్రిస్టియన్, ఓబీసీ కార్పోరేషన్ డబ్బులు వేరే పథకాలకు మళ్లించడం సరికాదని... రాష్ట్ర కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ కమిటీ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి హితవు పలికారు. కడప జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో... జీవో-12, అమ్మఒడి, వాహనమిత్ర పథకాల గురించి మాట్లాడారు.

tulasireddy press meet
కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ​ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 12 లక్ష్యం.. వాహనమిత్ర పథకానికి ఎనిమిది కార్పోరేషన్ల నుంచి నిధులు మళ్లించడమేనని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో మాట్లాడిన ఆయన... వాహనమిత్ర పథకానికి బడ్జెట్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి అమలు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఈ ఎనిమిది కార్పోరేషన్లు కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయన్నారు. వాహనమిత్ర పథకానికి బడ్జెట్​లో నిధులు కేటాయించి అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details