కడపలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణానికి చెందిన అహ్మద్ కుటుంబ సభ్యులు.. అనారోగ్యంతో బాధపడుతున్న బంధువులను పరామర్శించడానికి నెలరోజుల క్రితం( ఏప్రిల్ 31న) హైదరాబాద్ వెళ్లగా.. వారింట్లో దొంగలు పడ్డారు. ఏడు తులాల బంగారం, మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వారు మే31న(సోమవారం) వచ్చి చూడగా ఇంట్లో సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బీరువా తాళాలు పగలకొట్టిన దొంగలు డబ్బు, బంగారం ఎత్తుకెళ్లారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.