ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించటం లేదా!?

రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించటం లేదా అని తెదేపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.

By

Published : Jul 3, 2019, 11:51 PM IST

రైతులను అధికార పార్టీ కష్టాలకు గురిచేస్తుంది: జిల్లాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

రైతులను అధికార పార్టీ కష్టాలకు గురిచేస్తుంది: జిల్లాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి

రాష్ట్రంలో అధికార పార్టీ చిరు ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడుతోందని తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తెదేపా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్​లో రైతులకు కావలసిన విత్తనాలను సకాలంలో అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు రైతులను కష్టాలుకు గురి చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలను తొలగిస్తామని చెపుతూ వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అన్యాయం జరిగే చిరుద్యోగులకు తెదేపా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

కడప జిల్లాలో కరువు పరిస్థితులు విలయతాండవం చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకుండా రాజకీయ కక్షలు పాల్పడుతుండడం దారుణమన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని తెదేపా కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి... పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

ఇవీ చదవండి...వివేకా హత్య కేసులో విచారణ వేగవంతం

ABOUT THE AUTHOR

...view details