ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 19, 2020, 3:49 PM IST

Updated : Nov 19, 2020, 5:19 PM IST

ETV Bharat / state

కారు, మినీ ట్రక్కు ఢీ... క్యాబిన్​లో ఇర్కుకున్న డ్రైవర్...

వేగంగా వెళ్తున్న కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. మినీ ట్రక్కు డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కున్నాడు. అతన్ని అతి కష్టమ్మీద బయటకు తీశారు.

road accident at  railway Koduru
కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది

కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని రాజనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు ఎగిరి... వెనుక భాగం గాల్లోనే ఉండి పోయింది. మరో వైపు ట్రక్కు ముందు భాగంలో డ్రైవర్ క్యాబిన్​లో ఇరుక్కు పోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో... వారు ఎంతో చాకచక్యంతో అతన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న నలుగురితోపాటు... ట్రక్కు లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Nov 19, 2020, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details